ధరణి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర భూ పరిపాలనా విభాగం ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ధరణి పెండింగ్ దరఖాస్తులు, ప్రజావాణిలో భూ సంబంధిత అంశాలపై దరఖాస్తుదారులు సమర్పించిన అర్జీలపై చేపట్టిన చర్యలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు.