బోధన్‌లో శిశువు అదృశ్యం.. శిశువు శరీర అవయవాలు లభ్యం

84చూసినవారు
బోధన్ పట్టణంలో శిశువు అదృశ్యమైనట్లు పట్టణ సీఐ వెంకట నారాయణ తెలిపారు. మహిళ యాచకురాలు పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ ప్రాంతంలో సోమవారం రాత్రి తన పదినెలల చిన్నారితో నిద్రిస్తుంది. బాధిత మహిళ బహిర్భూమికి వెళ్లి తిరిగి వచ్చే వరకు తన బాబు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. మంగళవారం స్థానిక కొత్త బస్టాండ్ డిపో ప్రాంగణంలో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసు సిబ్బంది కొన్ని శిశువు శరీర అవయవాలను గుర్తించి ఫోరెన్సిక్ పరీక్షకు పంపించినట్లు సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్