సంఘ అభివృద్ధికి ప్రతి రైతు సహకరించాలి

572చూసినవారు
సంఘ అభివృద్ధికి ప్రతి రైతు సహకరించాలి
సంఘ అభివృద్ధికి ప్రతి రైతు సహకరించాలని సాలుర పిఎసిఎస్ చైర్మన్ అల్లె జనార్ధన్ అన్నారు. శనివారం సాలుర పిఎసిఎస్ ఆవరణలో మహాజన సభను చైర్మన్ అధ్యక్షతన నిర్వహించారు. సంఘ సీఈవో బస్వంత్ రావు సంఘ జమ ఖర్చుల వివరాలను డైరెక్టర్లు, రైతులకు వివరించారు. సన్ ఫ్లవర్, మొక్కజొన్న, కుసుమల విక్రయాలకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సభలో సంఘ వైస్ చైర్మన్ సందీప్ రెడ్డి, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్