సాలురా: దుర్గా మాత మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమం

81చూసినవారు
నిజామాబాద్ జిల్లా సాలురా మండలం జాడి జమాల్ పూర్ గ్రామంలో శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా నెలకొల్పిన అమ్మవారి వద్ద గురువారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుందర్ రాజ్ కుటుంబ సభ్యులతో కలిసి హోమం నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో బాగుండాలని మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.

సంబంధిత పోస్ట్