అంబేద్కర్ విజ్ఞాన కేంద్ర ఏర్పాటు అభినందనీయం

50చూసినవారు
అంబేద్కర్ విజ్ఞాన కేంద్ర ఏర్పాటు అభినందనీయం
సాలూర మండల కేంద్రంలో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం(లైబ్రరీ)ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రముఖ సంఘ సేవకురాలు, గవర్నర్ అవార్డు గ్రహీత సరోజినమ్మ అన్నారు. మంగళవారం ఆమె అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించారు. అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం అభివృద్ధి, పాఠకుల సౌకర్యార్థం సహాయ సహకారాలు అందించడానికి ఎల్లవేళలా ముందుంటానని ఆమె హామీ ఇచ్చారు. కమిటీ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, పాండు, బొర్ర గంగారం, కేజీ గంగారం ఉన్నారు.

సంబంధిత పోస్ట్