మద్యానికి బానిసై ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

83చూసినవారు
మద్యానికి బానిసై ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజాంసాగర్ మండలం ఆరేడులో బుధవారం జరిగింది. నిజాంసాగర్ ఎస్ఐ. సుధాకర్ కథనం ప్రకారం పి. అశోక్ (35) మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం రాత్రి తన కుటుంబ సభ్యులు మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వడం లేదని క్షనికావేశానికి గురై తన ఇంట్లోనే చీరతో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్