కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ముందు గల చాకలి ఐలమ్మ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజిబొద్దిన్ గురువారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జాకంటి ప్రభాకర్ రెడ్డి, పిప్పిరి వెంకటి, గైని శ్రీనివాస్ గౌడ్, నజీరోద్దిన్, హఫీజ్ బేగ్, గెరిగంటి స్వప్న లక్ష్మినారాయణ, పోలీస్ కృష్ణాజీరావు, కాసర్ల గోదావరి స్వామి, తదితరులున్నారు.