పౌరసరఫరాల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష

71చూసినవారు
పౌరసరఫరాల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష
కామారెడ్డి నియోజకవర్గం నిర్ణీత గడువులోగా సీఎంఆర్ సరఫరా చేయని వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో పౌరసరఫరాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఈ నెల 30లోగా సరఫరా చేయని పక్షంలో అపరాధ రుసుము విధించడంతో పాటు, వచ్చే వానాకాలంలో ధాన్యం కేటాయింపులు జరుగవని తెలిపారు. రెవెన్యూ రికవరీ యాక్ట్ క్రింద చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్