గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి

71చూసినవారు
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి
నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలు అయ్యాయి. పడకల్ గ్రామానికి చెందిన గుండ్ల భోజమ్మ, నారాయణ గౌడ్ ఇద్దరు కలిసి బైక్ పై వెళుతుండగా మేంట్రజ్ పల్లిలోని జాతీయ రహదారి 44 వద్ద ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో ఇద్దరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే భోజమ్మ మృతి చెందింది.

సంబంధిత పోస్ట్