హైదరాబాద్ టీం గెలవాలని ప్రత్యేక పూజలు

55చూసినవారు
నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఇందల్వాయి గ్రామంలో శనివారం రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపు జరగబోయే ఐపీఎల్ ఫైనల్ లో కోల్కతా వర్సెస్ హైదరాబాద్ టీమ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ గెలవాలని దీపక్ పంతులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరెంజ్ ఆర్మీ అభిమానులు గోపి, అశోక్, సతీష్ పవార్, మను, సందీప్, విశాల్, అరుణ్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్