బజ్జీల కోసం గొడవ.. ముగ్గురు అరెస్ట్

74చూసినవారు
బజ్జీల కోసం గొడవ.. ముగ్గురు అరెస్ట్
బజ్జీల కోసం జరిగిన గొడవ కారణంగా ముగ్గురు జైలు పాలైన ఘటన నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. అంబేద్కర్‌ కాలనీకి చెందిన ఆకాశ్‌, మనీష్‌, ప్రమోద్‌లు రెండు రోజుల క్రితం తెల్లవారుజామున బజ్జీలు తినేందుకు బస్టాండ్‌ ఎదురుగా ఉన్న ఓ హోటల్‌కు వెళ్లారు. బజ్జీలు తింటుండగా.. ఆకాశ్‌ మరో రెండు బజ్జీలు కావాలన్నారు. అయితే బజ్జీలు అయిపోయాయని హోటల్‌ యజమాని చెప్పడంతో గొడవ జరిగింది. ఆగ్రహంతో వారు యజమాని సచిన్ ఇంటిపై పెట్రోల్‌ బాటిళ్లతో దాడి చేసి నిప్పంటించారు. ఘటనపై సచిన్‌ ఆదివారం మూడో టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సంబంధిత పోస్ట్