జిల్లా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు: కలెక్టర్

575చూసినవారు
జిల్లా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు: కలెక్టర్
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం జిల్లా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వేసవి తీవ్రతలోనూ నియమ నిష్ఠలతో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు నిర్వర్తించడం ఎంతో గొప్ప విషయమన్నారు. అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో కాలం వెళ్లదీయాలని, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్