May 05, 2024, 12:05 IST/నిజామాబాద్ అర్బన్
నిజామాబాద్ అర్బన్
పొరపాట్లకు తావులేకుండా ఈవీఎంల కమిషనింగ్ - కలెక్టర్
May 05, 2024, 12:05 IST
నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని ఆర్మూర్, బాల్కొండ శాసనసభా నియోజకవర్గాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం సందర్శించారు. నిజామాబాద్ ఎన్నికలలో పోలింగ్ నిర్వహణ కోసం చేపడుతున్న ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, సంబంధిత అధికారులు ఉన్నారు.