ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఆయన్ని తక్షణమే బదిలీ చేయాలని, ఎన్నికల విధులు అప్పగించకూడదని సీఎస్కు ఆదేశాలిచ్చింది. సోమవారం ఉదయం 11 గంటలలోగా ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల జాబితా పంపాలని స్పష్టం చేసింది. డీజీపీని బదిలీ చేయాలని గత కొంతకాలంగా విపక్షాల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఈసీ చర్యలకు ఉపక్రమించింది.