రేపు సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరిన వైద్యులపై ఎలాంటి చర్యలు ఉండవు: సుప్రీం కోర్టు

73చూసినవారు
రేపు సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరిన వైద్యులపై ఎలాంటి చర్యలు ఉండవు: సుప్రీం కోర్టు
కోల్‌కతాలో ఆర్జీ కర్ కాలేజీ వైద్యురాలిపై అత్యాచారం-హత్య కేసుపై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనపై నిరసన తెలుపుతున్న వైద్యులు రేపు (మంగళవారం) సాయంత్రం 5 గంటల్లోగా తిరిగి విధుల్లో చేరాలని కోర్టు సూచించింది. తిరిగి విధుల్లో చేరితే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ నిరంతరాయంగా విధులకు దూరంగా ఉంటే, వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపింది.

సంబంధిత పోస్ట్