పాము కాటుతో ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి

61చూసినవారు
పాము కాటుతో ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి
ఒడిశాలోని బౌధ్‌ జిల్లా చరియాపాలీ గ్రామంలో విషాద ఘటన జరిగింది. ఆదివారం రాత్రి సురేంద్ర తన కుటుంబంలో కలిసి పడుకున్నాడు. ఉదయాన్నే ఆయన ముగ్గురు కుమార్తెలు సుధీరేఖ, శుభరేఖ, సౌరభి శ్వాస తీసుకోలేకపోయారు. సమీపంలో క్రైట్ నాగుపాము కనిపించింది. పాముకాటుకు గురైన కుమార్తెలను తొలుత మంత్రగాడి వద్దకు సురేంద్ర తీసుకెళ్లాడు. పరిస్థితి విషమించడంతో కుమార్తెలు చనిపోయారు. సురేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్