బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్ర ఉంది: మంత్రి నిమ్మల (వీడియో)

81చూసినవారు
ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసులో భాగంగా ఇద్దరు వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై తాజాగా మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్ర కోణం ఉందన్నారు. దాదాపు 40-50 టన్నుల బరువున్న 3 బోట్లను ప్లాస్టిక్ తాడుతో కట్టారన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని వివరాలు ఇంకా తెలుస్తాయన్నారు.

సంబంధిత పోస్ట్