పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అమలును ప్రపంచంలోని ఏ శక్తీ అడ్డుకోలేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. 'సీఏఏపై బెంగాల్ సీఎం మమత ముస్లింలలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. సీఏఏను ఆపే అధికారం రాష్ట్రాలకు లేదు. మమత పార్టీ అవినీతిలో కూరుకుపోయింది. కానీ పదేళ్ల మా ప్రభుత్వంలో ఒక్క అవినీతి మచ్చ కూడా లేదన్నారు.