గణపతి పూజలో పుష్పాలు ఎన్ని వాడినా.. పత్రిలో గరిక తప్పనిసరి

84చూసినవారు
గణపతి పూజలో పుష్పాలు ఎన్ని వాడినా.. పత్రిలో గరిక తప్పనిసరి
చవితి పూజలో ఎన్ని రకాల పుష్పాలు వాడినా పత్రిలో గరిక లేకపోతే వినాయకుడు లోటుగా భావిస్తాడని పూజారులు చెబుతున్నారు. దీనికి గల కారణం కూడా తెలిపారు. పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు విపరీతమైన వేడి పుట్టించి దేవతల్ని ఇబ్బందులకు గురిచేశాడట. ఆ రాక్షసుడిని గణేశుడు మింగేయడంతో ఆయన శరీరం వేడిగా మారిందట. దీంతో రుషుల సూచనతో 21 గరిక పోచలను స్వామి తలపై పెట్టగా, వేడి తగ్గిపోయిందని, అందుకే పూజలో గరికకు ప్రాధాన్యం దక్కినట్లు చెబుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్