ఇకపై ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరుగుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఏడాదిలోగా పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంపై అధికారులను ఆరా తీశారు. బైజూస్ కంటెంట్, ఐఎఫ్బీ వినియోగం మీద సమగ్ర నోట్ ఇవ్వాలని సూచించారు.