టీ20 ప్రపంచకప్ ఫైనల్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రస్తుతం కోహ్లీ ఫామ్ గురించే అభిమానుల్లో తీవ్ర ఆందోళన రేపుతోంది. ఈ నేపథ్యంలో కోహ్లీ బ్యాటింగ్ గురించి ఆందోళన అక్కర్లేదని.. ఒక్కసారి కుదురుకుంటే అతడిని ఆపడం చాలా కష్టమని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. కోహ్లీ ఫామ్ కంటే జట్టు ఫామ్ అత్యంత ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు జట్టంతా కలిసి కట్టుగా ఆడుతోంది. ఒకరిపైనే ఆధారపడి లేదు అని తెలిపాడు.