భారత యువ బ్యాటర్ శివమ్ దూబె యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో మెరిశాడు. మ్యాచ్ అనంతరం తన ఆటతీరుపై దూబె ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టోర్నీ ఆరంభంలో నా ఫామ్పై ఇబ్బంది పడ్డా. ఎలా బయటపడాలనే దానిపై దృష్టిసారించా. అందుకోసం తీవ్రంగా శ్రమించా. అదే సమయంలో నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. కోచ్లు, సహాయక సిబ్బంది మద్దతుగా నిలిచారు. ఇప్పుడు ఈ టోర్నీలో నేను ఆడుతుంటే.. నాకు రంజీ ట్రోఫీ మ్యాచ్ గుర్తుకొచ్చింది’’ అని పేర్కొన్నాడు.