భారత టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) కొత్త సిఫార్సులకు సిద్ధమైంది. మొబైల్ నంబర్, ల్యాండ్ లైన్ నంబర్కు ఛార్జీలు వసూలు చేయాలని భావిస్తోంది. నంబర్పై కొంత మొత్తం విధించి ఆపరేటర్ల నుంచి వసూలు చేస్తుంది. ఆయా కంపెనీలు యూజర్ల నుంచి దాన్ని రికవరీ చేసుకునే అవకాశం కల్పిస్తుందట. ఫోన్ నంబర్లు కూడా చాలా ముఖ్యమైనవి కావడంతో ఈ నిర్ణయం తీసుకోబోతుందని సమాచారం.