మూడు నూతన నేర చట్టాల అమలుపై స్టే విధించాలంటూ గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జులై 1 నుండి భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహితా 2023, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలు అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త చట్టాల అమలులో సాధ్యా సాధ్యాలను అంచనా వేయడానికి వెంటనే నిపుణుల కమిటీని ఏర్పాటుచేయాలని న్యాయవాదులు సంజీవ్ మల్హోత్రా, కున్వర్ సిద్ధార్థ్లు రిట్ పిటిషన్ దాఖలు చేశారు.