ఎన్ఆర్ఐ, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాతో ముడిపడిన మోసపూరిత వివాహాలు పెరుగుతుండటంపై న్యాయ కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. వారి వివాహాలు భారత్లో నమోదు చేయాలని సూచించింది. ఈ అంశాలపై రూపొందించిన ఓ నివేదికను న్యాయశాఖకు సమర్పించింది. భార్యాభర్తలిద్దరి పాస్పోర్ట్లపై వివాహ రిజిస్ట్రేషన్ నంబర్ను పొందుపర్చడానికి ‘పాస్పోర్ట్ చట్టం, 1967లో అవసరమైన సవరణలు తీసుకురావాలని న్యాయ కమిషన్ సిఫార్సు చేసింది.