విపక్షాల ఆరోపణలపై స్పందించిన ఒడిషా సీఎం
By Shivakrishna 72చూసినవారుఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ తరపున బీజేడీ నేత వీకే పాండ్యన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని మాజీ బీజేడీ నేతలతో పాటు విపక్ష నేతలు గుప్పిస్తున్న ఆరోపణలపై సీఎం స్పందించారు. విపక్షాలు తనపై వ్యక్తిగత విమర్శలకు దిగడంపై ఓ వార్తా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నవీన్ పట్నాయక్ స్పందిస్తూ దేశంలో వారి ప్రతిష్ట దిగజారడంతో దిక్కుతోచని స్దితిలో వ్యక్తిగత విమర్శలకు తెగబడుతున్నారని వ్యాఖ్యానించారు.