స్కూల్ బస్సులపై అధికారుల కొరడా

57చూసినవారు
స్కూల్ బస్సులపై అధికారుల కొరడా
తెలంగాణలో పాఠశాలలు ప్రారంభమయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన ఆర్టీవో అధికారులు అన్ని స్కూలు బస్సులను తనిఖీ చేయడం ప్రారంభించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బస్సులపై కొరడా ఝులిపిస్తున్నారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రెండో రోజు స్కూల్ బస్సుల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. రాజేంద్రనగర్, శంషాబాద్, చేవెళ్ల, బాలాపూర్, కొండాపూర్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం వంటి ఏరియాల్లో బస్సులపై దాడులు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్