ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై వైసీపీ అధినేత జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫలితాలను బట్టి ప్రజలు 40 శాతం మంది తమవైపే ఉన్నారని చెప్పారు. ఈవీఎంల తీరు శకుని పాచికలా ఉందని వ్యాఖ్యానించారు. అందుకే వాటి పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడవద్దని నేతలకు సూచించారు. ఎమ్మెల్సీలతో సమావేశం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.