సముద్రంలో మునిగిపోయిన చమురు ట్యాంకర్.. ఒకరు మృతి!

84చూసినవారు
సముద్రంలో మునిగిపోయిన చమురు ట్యాంకర్.. ఒకరు మృతి!
ఫిలిప్పీన్స్‌ సముద్ర జలాల్లో గురువారం తెల్లవారుజామున చమురు ట్యాంకర్‌ షిప్‌ ఎంవీ టెర్రా నోవా మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 16 మందిని రెస్క్యూ బృందం సురక్షితంగా రక్షించారు. అయితే, 15 లక్షల లీటర్ల పారిశ్రామిక చమురు నీటిపాలు అయినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి తీవ్రమైన గాలులే కారణమని అధికారులు చెప్పారు.

సంబంధిత పోస్ట్