తమిళనాడులోని దిండిగల్ జిల్లా పళనిలోని ఇట్టేరి రోడ్డులో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. ఓ వృద్ధుడు తన మనవడితో కలిసి స్కూటర్పై వెళ్తున్నాడు. ఆ సమయంలో రోడ్డు మలుపు వద్ద వారి స్కూటర్ను ఓ ఓమ్నీ వ్యాన్ ఢీకొట్టింది. దీంతో స్కూటర్పై నుంచి వృద్ధుడు, ఆయన మనవడు డ్రెయిన్లో పడిపోయారు. స్వల్పంగా గాయపడిన వారిని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.