ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ పరంగా మరోసారి రూ.20 లక్షల కోట్లను దాటింది. బుధవారం మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈలో షేరు విలువ 3.60శాతం పెరిగి రూ.2,987.85 వద్ద గరిష్ఠాన్ని తాకడంతో ఈ ఘనత సాధించింది. ఇంట్రాడేలో షేరు 4శాతం పెరిగి 2,999.90 గరిష్ఠాన్ని తాకింది. మార్కెట్ విలువ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.70,039.26 కోట్లు పెరిగి రూ.20,21,486.59 కోట్లకు చేరుకుంది.