శివసేన (ఉద్ధవ్ వర్గం) ఎంపీ అభ్యర్థి అమోల్ కీర్తికర్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. కరోనా సంక్షోభ సమయంలో వలస కార్మికులకు ఆహార పంపిణీకి సంబంధించిన కాంట్రాక్టుల కేటాయింపులో ఆయన అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించింది. కాగా, తనను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే భయపెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈడీతో నోటీసులు పంపారని శివసేన నేత సంజయ్ రౌత్ ఆరోపించారు.