తెలంగాణలో ఎండలు మండిపోతున్నారు. ఇవాళ సూర్యాపేటలో వడదెబ్బ తగిలి ఒకరు మృతి చెందారు. అనేక ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో ఇవాళ, రేపు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.