తుక్కుగూడ జనజాతర సభకు వచ్చిన స్పందనపై సీఎం రేవంత్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'కాంగ్రెస్ ఓ మహా సముద్రం.. అందులో కార్యకర్తలు నీటి బిందువులు కాదు.. పేదల బంధువులు. కార్యకర్తలు పోటెత్తే కెరటాలు, పోరాడే సైనికులు. ఎజెండాలు నిర్ణయించే నాయకులు. నిన్నటి తుక్కుగూడ గడ్డపై పోటెత్తిన కాంగ్రెస్ మహా సముద్రపు కెరటాలు చెప్పిన నిజమిది.. చేసిన శబ్దమిది అంటూ రేవంత్ వీడియో షేర్ చేశారు.