టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్. స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ పూర్తిగా కోలుకున్నారు. తాజాగా నెట్స్లో సాధన ప్రారంభించారు. అందుకు సంబంధించిన వీడియో ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేయగా, పంత్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2022 డిసెంబరులో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ అప్పటి నుంచి క్రికెట్కు దూరమయ్యారు. ఈ ఏడాది ఐపీఎల్ కు ఆడనున్నారు. ఆ తర్వాత టీమ్ ఇండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు.