భారత్-బంగ్లాదేశ్‌ రెండో టెస్టు వేదిక మార్పుపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

65చూసినవారు
భారత్-బంగ్లాదేశ్‌ రెండో టెస్టు వేదిక మార్పుపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ
భారత్-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య రెండో టెస్టు వేదికను కాన్పూర్‌ నుంచి కదలించేదే లేదని బీసీసీఐ వర్గాలు స్పష్టంచేశాయి. ఈ రెండవ టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు జరగనుంది. అయితే, బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్నాయనే కారణంతో ఆ దేశ క్రికెట్‌ జట్టు పర్యటనను అడ్డుకోవాలని హిందూ మహాసభ నిర్ణయం తీసుకుందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వేదికలో ఎలాంటి మార్పులేదని బీసీసీఐ స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్