అయోధ్యలో శ్రీ రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్
రామ్చరణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో అయోధ్య రామ మందిరం వద్ద జనసేనాని ఒక సెల్ఫీ దిగారు. దీనిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాక ఈ వేడుకపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు తనకి చాలా ఎమోషనల్గా మారిందని, ప్రాణప్రతిష్ఠ సమయంలో కళ్లలో నీళ్లు తిరిగాయని చెప్పుకొచ్చారు.