ఉద్యోగులు, కార్మికులకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) శుభవార్త తెలిపింది. ఉద్యోగులు, కార్మికులు తమ PFను విత్డ్రా చేసుకునే మార్గాలను సులభతరం చేస్తోంది. ఇక నుంచి UPI, paytm ద్వారా రూ.లక్ష వరకు విత్ డ్రా చేసుకోవచ్చని చెప్పింది. అదేవిధంగా కోరుకున్న అకౌంట్కు నగదును బదిలీ చేసుకోవచ్చని తెలిపింది. జూన్, 2025 నుంచి ఈ విధానం అమలులోకి వస్తుందని వెల్లడించింది.