దుర్గ్-విశాఖ, నాగ్‌పూర్- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌ సహా 6 వందేభారత్ రైళ్లను ప్రారంభించిన పీఎం మోదీ

56చూసినవారు
దుర్గ్-విశాఖ, నాగ్‌పూర్- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌ సహా 6 వందేభారత్ రైళ్లను ప్రారంభించిన పీఎం మోదీ
పీఎం నరేంద్ర మోదీ సోమవారం 6 వందభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో ఒకటి దుర్గ్-విశాఖపట్నం మధ్య నడుస్తుంది. ఇది విశాఖ నుంచి ప్రయాణించే నాలుగో వందేభారత్ రైలు. ఈ నెల 20 నుంచి ఈ రైలు రెగ్యులర్‌గా తిరగనుంది. ఈ 6 రైళ్లలో నాగ్‌పూర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌ కూడా ఉంది. ఇది 19వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. వారణాసి-ఢిల్లీ మధ్య నడిచే భారత తొలి 20 కోచ్ వందే భారత్ రైలునూ పీఎం ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్