బర్మా దేశ సైనిక ప్రభుత్వ అధినేత జనరల్ మిన్ అంగ్ హ్లాయింగ్తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ప్రస్తుతం థాయ్లాండ్ పర్యటనలో ఉన్న ప్రధాని.. శుక్రవారం బిమ్స్టెక్ సదస్సులో ప్రముఖ నేతలతో సమావేశమయ్యారు. భూకంపంతో దెబ్బ తిన్న మయన్మార్ను ఆదుకునేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. అనుసంధాన, సామర్థ్యాల పెంపు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలపై చర్చించినట్లు 'X' వేదికగా ట్వీట్ చేశారు.