జమ్మూకశ్మీర్లో ఇటీవల ఉగ్ర దాడులు పెరుగుతున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలో నాలుగు దాడులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే జమ్మూకశ్మీర్లోని భద్రత పరిస్థితులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం సమీక్షించారు. స్థానికంగా భద్రత పరిస్థితులు, ఉగ్ర వ్యతిరేక కార్యకలాపాల గురించి అధికారులు ప్రధానికి వివరించారు. ఈ క్రమంలోనే ఉగ్ర నిరోధక సామర్థ్యాలను పూర్తిస్థాయిలో రంగంలోకి దించాలని ప్రధాని ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.