రాజస్థాన్ బార్మర్ జిల్లాలో జరిగిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. భద్రేష్ గ్రామానికి చెందిన ముఖేష్ సోదరి జెథాని అమానవీయంగా ప్రవర్తించింది. తన సోదరుడి బిడ్డ నోట్లో విషం పోసింది. ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. గతంలోనూ జెథాని ఇలాగే ప్రవర్తించింది. దీంతో ముఖేష్కు పుట్టిన ఇద్దరు పిల్లలు గతంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఆమె పిల్లలకు విషం ఇచ్చిన వీడియో వైరల్ అవుతోంది.