పీఓకే ముమ్మాటికీ భారత్‌దే: అమిత్ షా

71చూసినవారు
పీఓకే ముమ్మాటికీ భారత్‌దే: అమిత్ షా
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) ముమ్మాటికీ భారత్‌కే చెందుతుందని, దానిని వెనక్కి తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ‘ఫరూక్ అబ్దుల్లా, మణిశంకర్ అయ్యర్‌లు పాకిస్థాన్‌లో అణుబాంబు ఉన్నందున గౌరవం ఇవ్వండి అని చెబుతున్నారు. కానీ అటువంటి వాటికి బీజేపీ భయపడదు. పీఓకే ముమ్మాటికీ భారత్ దే’ అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్