మధ్యప్రదేశ్లోని చిత్రకూట్ జిల్లా గోకుల్ గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు భూ వివాదంపై ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. ఫిర్యాదు మేరకు పోలీసులు వారిని అరెస్టు చేశారు. దీంతో ఇంట్లోని మహిళలు వారిని కలిసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఔట్పోస్టు ఇన్చార్జి శ్యామ్ దేవ్ సింగ్ మహిళలపై దుర్భాషలాడుతూ, అసభ్యంగా ప్రవర్తించి లాఠీలతో ఔట్పోస్టు నుంచి వెళ్లగొట్టారు.