AP: వైసీపీ నేత వల్లభనేని వంశీని హైదరాబాద్లో అరెస్టు చేసి విజయవాడకు తీసుకెళ్తుండగా, ఆ వాహనం వెనుక వస్తున్న ఆయన భార్య కారును నందిగామ వద్ద పోలీసులు ఆపారు. తర్వాత ఆమె ఫోన్ను స్వాధీనం చేసుకుని ఎస్కార్ట్ వాహనంలో HYDకు తరలించారు. మరోవైపు, పోలీసులు ముందుగా వంశీని విజయవాడ భవానీపురం పీఎస్కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి మరో వాహనంలో పటమట పీఎస్కు తీసుకెళ్లారు. ఆయన అరెస్టును పలువురు వైసీపీ నేతలు ఖండిస్తున్నారు.