తెలంగాణలో 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

19176చూసినవారు
తెలంగాణలో 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్
తెలంగాణలో 13 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సా. 4 గంటల వరకే పోలింగ్ కు అనుమతి ఇచ్చారు. సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వారావుపేటలో పోలింగ్ ముగిసింది. క్యూ లైన్ లో ఉన్నవారికే ఓటు వేసే అవకాశాన్ని అధికారులు కల్పిస్తున్నారు.

సంబంధిత పోస్ట్