రేపే సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్

576చూసినవారు
రేపే సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్
సార్వత్రిక ఎన్నికల తొలిఘట్టం రేపే ప్రారంభంకానుంది. మొత్తం ఏడు దశల్లో నిర్వహిస్తున్న ఎన్నికల్లో తొలిదశకు కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టనుంది. మొత్తం 102 లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. తొలిదశలో తమిళనాడులోని మొత్తం 39 స్థానాలు సహా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని లోక్‌సభ సీట్లకు పోలింగ్ జరగనుంది. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.

సంబంధిత పోస్ట్