బీహార్కు చెందిన ప్రముఖ యూట్యూబర్ మనీష్ కశ్యప్ బీజేపీలో చేరారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఆ పార్టీ నాయకుల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. కాగా గతంలో కశ్యప్ పశ్చిమ చంపారన్ నియోజకవర్గం నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు.