నార్వే చెస్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద 8వ రౌండ్లో ఓటమిపాలయ్యాడు. వరల్డ్ నం.1 మాగ్నస్ కార్ల్సన్(నార్వే) అతనిపై విజయం సాధించాడు. మూడో రౌండ్లో కార్ల్సన్ను ప్రజ్ఞానంద ఓడించిన విషయం తెలిసిందే. మొదట 8వ రౌండ్లో క్లాసికల్ గేమ్ను కార్ల్సన్తో కలిసి అతను డ్రా చేసుకున్నాడు. దీంతో ఆర్మగెడాన్ టై బ్రేకర్ను నిర్వహించగా.. అక్కడ ప్రజ్ఞానందను కార్ల్సన్ ఓడించాడు.