ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్రావును పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రహస్య ప్రదేశంలో ప్రణీత్రావును పోలీసులు విచారిస్తున్నారు. ఎస్ఐబీలోని హర్డ్ డిస్క్లు ధ్వంసం, రికార్డుల మాయం వ్యవహారంలో అతడిపై పంజాగుట్ట పిఎస్ లో కేసు నమోదైంది. ఈ క్రమంలోనే మాజీ ఐపీఎస్ ప్రభాకరరావు పాత్రపై పోలీసులు విచారణ చేపట్టారు. అలాగే ప్రణీత్రావుకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్, కాల్ డీటెయిల్స్, డేటా రీట్రీవ్ చేయనున్నారు.